Bridge Collapses | గడిచిన దాదాపురెండు వారాల్లో బిహార్లో నాలుగు వంతెనలు నేలమయ్యాయి. కోట్లాది వ్యయంతో నిర్మించిన వంతెనలు పేకమేడల్లా కూలిపోయాయి. తాజాగా జార్ఖండ్లోని గిరిదిహ్ జిల్లాలో నిర్మానంలో వంతెన కుప్పకూలింది. డియోరీ సబ్డివిజన్లోని ఫతేపూర్-భెల్వాఘటి గ్రామాల రాకపోకలకు వీలుగా రూ.5కోట్లకుపైగా వ్యవయంతో అర్గా నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. అయితే, ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదిలో నీటి పరిమాణంతో పాటు వేగంగా ప్రయాణించడంతో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. వంతెన శిథిలాలు నదిలోనే పడిపోయాయి. ఓ పిల్లర్ పక్కకు ఒరిగిపోయింది. రూ.5.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఓం నః శివాయ కన్స్ట్రక్షన్స్ అనే ప్రైవేట్ సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. నదిలో నీరు వేగంగా రావడం వల్లే వంతెన కూలిందని ఓ వ్యక్తి తెలిపాడు. కూలిపోయిన సమయంలో భారీ శబ్దం వచ్చిందని వివరించారు. అధికారులు వంతెనను పరిశీలించారు.
#WATCH झारखंड के गिरिडीह में निर्माणाधीन पुल का हिस्सा ढह गया। pic.twitter.com/ueiXHbjrKK
— ANI_HindiNews (@AHindinews) June 30, 2024