Jairam Ramesh : భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్షానికి వెళతారని ఇస్రో చీఫ్ ఎస్.సోమ్నాథ్ పేర్కొన్నట్టు వచ్చిన వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రస్తావించారు. అంతరిక్షానికి వెళ్లే ముందు మన ప్రధాని మణిపూర్ వెళ్లాలని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. 2025లో చేపట్టే గగన్యాన్ మిషన్ను ప్రస్తావిస్తూ ఇస్రో చీఫ్ ఎస్. సోమ్నాథ్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ జైరాం రమేష్ ప్రధాని మోదీపై సోషల్ మీడియా పోస్ట్లో విమర్శలు గుప్పించారు.
కాగా మే,2023 నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ భగ్గుమంటుండగా ఈ ఘటనలపై విపక్ష ఎంపీల నుంచి మోదీ సర్కార్ విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని పార్లమెంట్లో కూడా విపక్షాలు పట్టుబట్టాయి. ఇక మణిపూర్లో సాధారణ పరిస్ధితి నెలకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతున్నదని ప్రధాని మోదీ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
మణిపూర్ అల్లర్లకు సంబంధించి 11000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, 500 మందికి పైగా అరెస్ట్ చేశారని తెలిపారు. మణిపూర్లో హింసాత్మక ఘటనలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. మణిపూర్లో శాంతి నెలకొనేందుకు కేంద్ర రాష్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయని వివరించారు. ఇవాళ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజ్లు, కార్యాలయాలు, ఇతర సంస్ధలు తెరుచుకున్నాయని తెలిపారు.
Read More :
Geoportal Bhuvan | గూగుల్ కంటే 10 రెట్లు అధిక సమాచారం.. భువన్ టూల్తో ఇస్రో అద్భుతాలు