Amritpal Singh | ఖలిస్థాన్ సానుభూతిపరుడు (Radical Sikh preacher) అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) లోక్సభ సభ్యుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు (Takes Oath As MP). ఇటీవలే జరిగిన లోక్సభ (Lok Sabha) ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్సాంలోని ధిబ్రూగఢ్ జైలు నుంచి పెరోల్పై నేరుగా ఢిల్లీకి వెళ్లిన ఆయన 18వ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకరాం చేశారు.
వారిస్ పంజాబ్ దే అధిపతి అయిన అమృత్పాల్ సింగ్ ఫిబ్రవరి 23న అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ధిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. అయితే, ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అమృత్పాల్కు అమృత్సర్ జిల్లా మెజిస్ట్రేట్ పెరోల్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు షరతులతో కూడిన పెరోల్ ఇచ్చింది. కారాగారం నుంచి ఢిల్లీకి వెళ్లి, తిరిగి కారాగారానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఢిల్లీని వదిలి మాత్రం ఎక్కడికీ వెళ్లకూడదని పేర్కొంది. ఢిల్లీలో ఉన్నప్పుడు అమృత్పాల్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ మీడియా ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేసింది.
ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంజినీర్ రషీద్
మరోవైపు జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ కూడా ఇవాళ లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన శుక్రవారం రెండు గంటల పెరోల్పై వచ్చి 18వ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రషీద్ (Engineer Rashid) భార్య, ముగ్గురు పిల్లలు, సోదరుడు సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రషీద్ ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
Also Read..
Engineer Rashid | ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంజినీర్ రషీద్
Assam Floods | వరదలకు అస్సాం అస్తవ్యస్థం.. 52కు పెరిగిన మృతులు.. 21 లక్షల మందిపై ప్రభావం