Engineer Rashid | లోక్సభ (Lok Sabha) ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నుంచి ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు (Takes Oath As MP). జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన శుక్రవారం రెండు గంటల పెరోల్పై వచ్చి 18వ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రషీద్ (Engineer Rashid) భార్య, ముగ్గురు పిల్లలు, సోదరుడు సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రషీద్ ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే జైల్లో ఉన్న కారణంగా మిగతా ఎంపీలతోపాటు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. ఎంపీగా గెలిచిన రషీద్ తనకు ప్రమాణ స్వీకారం కోసం మధ్యంతర బెయిల్గానీ, కస్టడీ పెరోల్గానీ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఆ పిటిషన్పై జూన్ 22న విచారణ జరిపిన పటియాలా కోర్టు.. రషీద్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ను ఆదేశించింది. రషీద్కు కస్టడీ పెరోల్ ఇచ్చేందుకు NIA అంగీకారం తెలుపడంతో.. జులై 5న (ఇవాళ) రెండు గంటల కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ ఆయన లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read..
Sonu Sood | కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో సోనూసూద్ సందడి.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తా అంటూ హామీ
Virat Kohli | ముంబై సెలబ్రేషన్స్ తర్వాత.. లండన్ ఫ్లైట్ ఎక్కేసిన కోహ్లీ.. ఎందుకంటే..?