భువనేశ్వర్: పూరీలోని శ్రీ జగన్నాథుని ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడం కోసం హుందాగా కనిపించే దుస్తులను ధరించాలని భక్తులను శ్రీ జగన్నాథ్ దేవాలయ పాలక మండలి కోరింది. పురుషులు ప్యాంట్, చొక్కా, చుడీదార్-పంజాబీ, ధోతీ, పంచె వంటివాటిని ధరించవచ్చునని, స్త్రీలు చీర, సల్వార్ కమీజ్ వంటివాటిని ధరించవచ్చునని తెలిపింది.