GMR | న్యూఢిల్లీ, జూన్ 29: ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో టెర్మినల్-1 కూలి ఒకరు మరణించిన ప్రమాదం తర్వాత విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది. 2018 నుంచి ఆ సంస్థ అధికార ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అధికార పార్టీకి పరోక్ష మార్గంలో భారీగా నిధులందజేసిన సంస్థల్లో జీఎంఆర్ ఒకటి.
కాగా, ఎలక్టోరల్ బాండ్లు అన్నవి ఎన్నికల ముందు వ్యక్తులు, సంస్థలు తమకు నచ్చిన పార్టీలకు విరాళాలు ఇచ్చే ఒక విధానం. అయితే ఎలక్టోరల్ ట్రస్ట్ అన్నది రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసేందుకు ఉద్దేశించిన మరో ప్రక్రియ. దీనికి నిర్దిష్ట కాలపరిమితి లేదు. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యక్తులు, సంస్థలు ట్రస్ట్కు విరాళం ఇవ్వవచ్చు.