న్యూఢిల్లీ: చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తున్నది. ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ తన ఉద్యోగులకు పంపిన సమాచారంలో ఈ బాధాకరమైన వార్తను తెలిపారు. 2025 నాటికి రూ.83,761 కోట్లు (సుమారుగా) ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీని కోసం ప్రస్తుతం పని చేస్తున్నవారిలో 15 శాతం (అంటే 15,000) మందిని తొలగించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆఫర్ను ప్రకటిస్తామన్నారు.