NEET Scam : నీట్ పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, నెట్-యూజీసీ 2024 పరీక్ష వివాదంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజ్లు కొనసాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
నీట్-యాజీ ఎగ్జామ్ చుట్టూ ముసురుకున్న వివాదాలకు నిరసరగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
పేపర్ లీక్లు, అక్రమాల ఆరోపణలతో విద్యార్ధులు, తల్లితండ్రులు తీవ్రంగా కలత చెందుతున్నారని యూత్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు.
Read More :
Sitarama Project | సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్