న్యూఢిల్లీ, జూన్ 29: లద్దాఖ్లో భారత సైన్యం శిక్షణలో విషాదం చోటుచేసుకుంది. ష్యోక్ నదిలో ఆకస్మికంగా వరదలు పోటెత్తడంతో యుద్ధ ట్యాంక్ ఒకటి నీళ్లలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
శుక్రవారం రాత్రి వాస్తవాధీన రేఖకు సమీపంలోని న్యోమా-చుషుల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షణ ముగించుకొని వస్తుండగా, అనూహ్యంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. జవాన్ల మృతిపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకుండా పోయిందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి ఒకరు ఉన్నారు.