న్యూఢిల్లీ: అమెరికా తయారు చేసే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్(Javelin Anti-Tank System)ను భారత్ కొనుగోలు చేయనున్నది. ఈ విషయాన్ని భారత్లోని అమెరికా అంబాసిడర్ సెర్గియా గోర్ తెలిపారు. దీంతో ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య రక్షణ సహకారం మరింత బలపడనున్నట్లు ఆయన చెప్పారు. యుద్ధాల్లో పరీక్షించిన జావెలిన్ యాంటీ ట్యాంక్ సిస్టమ్ను ఖరీదు చేసేందుకు ఇండియా ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. రెండు దేశాలు కలిపి ఆ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థలను డెవలప్ చేసే ప్లాన్ కూడా ఉన్నారు.
జావెలిన్.. ఓ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థ. లాక్హీడ్ మార్టిన్ దాన్ని డెవలప్ చేసింది. ఆర్మర్డ్ టార్గెట్ల కోసం దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అమెరికాతో పాటు దాని కూటమి దేశాలు ఈ యుద్ధాన్ని గతంలో వినియోగించాయి. జావెలిన్ సిస్టమ్ను భుజాలపై మోస్తూ ఆటోమెటిక్ మెకానిజం ద్వారా టార్గెట్ల మీదకు మిస్సైల్ను వదులుతారు. దీని ద్వారా ఆ మిస్సైల్ ఆపరేటర్ .. కౌంటర్ఫైర్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఫైరింగ్ తర్వాత మళ్లీ రీలోడ్ చేసేందుకు సైనికులు లేదా మెరైన్లు తమ పొజిషన్ మార్చుకోవచ్చు.