INDIA bloc | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో ఈ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే, ఇండియా కూటమి (INDIA bloc) నేతలు రాజ్యాంగ ప్రతి (Constitution Copy)తో పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రినేత రాహుల్ గాంధీ సహా కూటమి నేతలంతా రాజ్యాంగ ప్రతులతో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన చేపట్టారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకే నిరసన తెలుపుతున్నట్లు ఇండియా కూటమి సభ్యులు తెలిపారు. ప్రొటెం స్పీకర్ నియమించిన తీరు రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు.
#WATCH | Delhi: INDIA bloc leaders including Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Congress leader Rahul Gandhi, protest in Parliament premises pic.twitter.com/QoFKaoavR0
— ANI (@ANI) June 24, 2024
లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్ను నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన ప్రకటనపై ఇండియా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భర్తృహరి కంటే కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ సీనియర్ అని, దళితుడైనందు వల్లే సురేశ్కు ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. విపక్షాల ఆరోపణలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ ప్రొటెం స్పీకర్గా మహతాబ్ ఎంపికను సమర్థించుకున్నారు. మహతాబ్ వరుసగా ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, సురేష్ అలా కాలేదని చెప్పారు. సురేశ్ 2004 ముందు నాలుగుసార్లు, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ అంశం లోక్సభ సమావేశాల్లో హాట్ టాపిక్గా మారే అవకాశం కనిపిస్తున్నది.
#WATCH | INDIA bloc leaders holding copy of Constitution protest in Parliament, Delhi pic.twitter.com/ViPaa6diOk
— ANI (@ANI) June 24, 2024
మరోవైపు నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేస్తున్నారు. మొత్తం తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది.
#WATCH | Akhilesh Yadav, Dimple Yadav and all other MPs of Samajwadi Party arrived at the Parliament this morning, by carrying a copy of the Constitution of India. pic.twitter.com/eJBofV9Wwd
— ANI (@ANI) June 24, 2024
#WATCH | Delhi: TMC MP Kalyan Banerjee says, “We are protesting because the provisions of the Constitution have been violated. The Constitution has been violated by the Narendra Modi government. The way the pro-tem speaker has been appointed is a clear violation of the… pic.twitter.com/BWH3Ikrrew
— ANI (@ANI) June 24, 2024
#WATCH | TMC MP Sougata Roy says, “We are opposing BJP’s efforts to destroy the Constitution, to amend it beyond recognition.” pic.twitter.com/sOQN2eGuOq
— ANI (@ANI) June 24, 2024
Also Read..
Lok Sabha | లోక్సభ సమావేశాలు ప్రారంభం.. ఎంపీగా ప్రమాణం చేసిన మోదీ
PM Modi | మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తాం : ప్రధాని మోదీ
Bhartruhari Mahtab | ప్రొటెం స్పీకర్గా భర్తృహరి ప్రమాణం.. మరికాసేపట్లో లోక్సభ సమావేశాలు ప్రారంభం