న్యూఢిల్లీ, జూలై 2: లోక్సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. 18వ లోక్సభ మొదటి సమావేశాలు జూన్ 24న ప్రారంభమయ్యాయి. 34 గంటల పాటు సమావేశం జరిగింది. 539 మంది లోక్సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
జూన్ 26న స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన 18 గంటల పాటు జరిగిన చర్చలో 68 మంది సభ్యులు పాల్గొన్నారు.