Flight Ticket Cancellation | న్యూఢిల్లీ: విమాన ప్రయాణం అంటే అన్నివిధాల సౌకర్యంగానే ఉంటుంది. అయితే ఏదైనా కారణాలతో ప్రయాణం రద్దయ్యి టిక్కెట్ క్యాన్సిలేషన్ అంటే ‘వాచిపోతుంది’ అంటూ తరచూ విమాన ప్రయాణికులు వ్యాఖ్యానిస్తుంటారు. టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. రూ.13,820తో విమాన టిక్కెట్ కొన్నా.. అయితే అది క్యాన్సిల్ చేయడంతో వచ్చిన మొత్తం ఎంతో తెలుసా.. 20 రూపాయలు.. అంటూ ఐఏఎస్ అధికారి రాహుల్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశారు.
ఈ 20 రూపాయలతో ఏమైనా మంచి పొదుపు పథకాలుంటే చెప్పండి? అన్న ప్రశ్నకు టమాటాలపై పెట్టుబడి పెట్టండి.. షేర్లు కొనండంటూ యూజర్లు చమత్కరించారు. మొత్తం టిక్కెట్ చార్జీలో రూ.11,800 క్యాన్సిల్ చార్జీగా, 1,200 జీఐ క్యాన్సిలేషన్కు, రూ.800 జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద తగ్గించడంతో ఆయనకు 20 రూపాయలు రీఫండ్గా వచ్చింది. ఎయిర్లైన్స్లు ప్రయాణికులను దోచుకోవడం ఎంతవరకు సబబు… నేనైతే నా టిక్కెట్ను క్యాన్సిల్ చేయకుండానే వదిలేస్తా, క్యాన్సిల్ చేస్తే దానిని మరొకరికి ఆమ్ముకుని ఇంకా ఆర్జిస్తుంది… అని యూజర్లు కామెంట్లు చేశారు.
Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq
— Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023