Hathras Stampede : ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ తొక్కిసలాట (Hathras Stampede) లో పెద్ద సంఖ్యలో భక్తులు మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టుపెట్టారు.
హత్రాస్లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగింది. రతీభాన్పూర్లో శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు.
#WATCH | Uttar Pradesh | Hathras Stampede | Visuals from the spot where the incident took place, claiming the lives of several people. pic.twitter.com/PzZOKhlEYe
— ANI (@ANI) July 2, 2024