గువాహటి, జూలై 2: అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 19 జిల్లాల్లో 6.44 లక్షల మంది ప్రభావితమయ్యారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరదల వల్ల కజిరంగ జాతీయ పార్కు తీవ్రంగా ప్రభావితమైంది. కొన్ని జంతువులు భద్రత కోసం దగ్గర్లోని కొండ ప్రాంతాలకు వలస వెళ్లాయి. ప్రస్తుతం 7 వేల మంది నిరాశ్రయులు ఉపశమన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.