Harsimrat Kaur Badal : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేసిన ప్రసంగాన్ని శిరోమణి అకాలీదళ్ (SAD) ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ మెచ్చుకున్నారు. ఆయన (రాహుల్ గాంధీ) చెప్పదల్చుకున్నదని కరెక్టుగా చెప్పారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు.
తమకు న్యాయం చేయాలని పోరాడుతూ ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారికి కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని హర్సిమ్రత్ మండిపడ్డారు. రైతుల విషయంలో ఆయన (రాహుల్ గాంధీ) మాట్లాడిన దానితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని హర్సిమ్రత్ చెప్పారు. ‘ఆయన చెప్పాలనుకున్నది కరెక్టుగా చెప్పారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చలేదు. రైతులు మరణిస్తే నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. రైతుల గురించి ఆయన మాట్లాడిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా’ అని హర్సిమ్రత్ కౌర్ వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: On Rahul Gandhi’s speech, Akali Dal MP Harsimrat Kaur Badal says, “He said what he thought was right… The government has not yet fulfilled the demands of the farmers. Farmers lost their lives, they did not even get compensation. I agreed with him (Rahul Gandhi)… pic.twitter.com/iKRwmN9cPI
— ANI (@ANI) July 1, 2024