న్యూఢిల్లీ: రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు. న్యాయమూర్తుల వ్యక్తిగత విలువలు, విశ్వాసాలు, జోక్యం.. వంటివి రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన తీర్పుల్ని తీసుకొస్తాయని హెచ్చరించారు.
కోల్కతాలో ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. న్యాయశాస్త్రంలో రాజ్యాంగ నైతికత అమలు..గురించి వివరించారు. కోర్టులను దేవాలయాలుగా, జడ్జిలను దేవుళ్లుగా చూస్తే..అది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను నెరవేర్చటమే న్యాయమూర్తుల ప్రధాన కర్తవ్యమన్నారు.‘మమ్మల్ని లార్డ్షిప్, లేడీషిప్..అంటూ గౌరవంగా సంబోధిస్తారు. ప్రజలకు సేవకుడిగా ఉండటమే జడ్జి పాత్ర’ అని జడ్జిలను ఉద్దేశించి సీజేఐ అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోనూ కాదు, రాజ్యాంగ నైతికత జిల్లా న్యాయవ్యవస్థకు కూడా వర్తిస్తుందన్నారు.