కటక్: ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ను నమ్మి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో కటక్కు చెందిన ఐదుగురు విద్యార్థులు బైక్లపై సప్తసజ్య ఆలయానికి వెళ్లారు.
కొండపై ఉన్న విష్ణుబాబా మఠానికి జూన్ 30న చేరుకున్నారు. తిరిగి వచ్చే క్రమంలో గూగుల్ మ్యాప్స్పై ఆధారపడి.. నావిగేషన్ పెట్టుకున్నారు. అది అడవి మధ్యలోకి తీసుకెళ్లింది.
దీంతో 11 గంటల పాటు వారంతా అడవిలోనే చిక్కుకున్నారు. అలసిపోయి ఆహారం లేకుండా సాయంత్రం 5.30 గంటలకు భూషుని ఖోలాకు చేరుకున్నారు.
ఆ ప్రాంతం సందర్శకులకు నిషేధం. ఆ ప్రదేశంలో సహాయం కోసం ఎదురుచూసి, అతి కష్టం మీద పోలీసులను సంప్రదించగలిగారు. దెంకనల్ పోలీసులు, అటవీశాఖ సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి విద్యార్థులను గుర్తించారు.