కర్నల్: హర్యానాలోని కర్నల్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు(Goods Train Derails) తప్పింది. కొన్ని గూడ్స్ డబ్బాలు రైల్వే లైన్లపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ-అంబాలా రూట్లో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది. కర్నల్ సమీపంలోని తారారోయిలో ఈ ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 నిమిషాల మధ్య రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారు.
గూడ్స్ డబ్బాలు పట్టాలపై పడడంతో రెండు వైపుల వెళ్లాల్సిన రైళ్లను ఆపేశారు. ఢిల్లీ, అంబాలా రూట్ చాలా బిజీగా ఉంటుంది. దీంతో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం వల్ల ఎవరికీ గాయాలు కాలేదు. కాంటేనర్లను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎందు వల్ల ప్రమాదం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ట్రాక్లను క్లియర్ చేసి, సర్వీసులను ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. అమర్పాలీ, ఉంచహార్ రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నారు. కర్నల్ రైల్వే స్టేషన్లో అనేక మంది ప్రయాణికులు వేచి చూస్తున్నారు.