సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ను భావి ప్రధానిగా పేర్కొంటూ యూపీ రాజధాని లక్నోలో పోస్టర్లు వెలిశాయి.
జూలై 1న అఖిలేశ్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. తాజా లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించడమే ఈ చర్చకు కారణం.
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, హరిద్వార్, హల్దానీ, కోట్ద్వార్ ప్రాంతాల్లో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గంగా నదిలో అనేక కార్లు కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఢిల్లీ నగరంలో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి. మృతుల సంఖ్య 11కు చేరింది. మంత్రి ఆతిశీ ఢిల్లీ ఎల్జీతో భారీ వర్షాలపై చర్చించారు.