న్యూఢిల్లీ: ఇటీవల వాయిదా పడిన నీట్-పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) రెండు రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం వెల్లడించారు.
ఇటీవల రద్దు అయిన, వాయిదా పడిన మూడు పరీక్షల కొత్త తేదీలను ఎన్టీఏ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన్ ఈ మేరకు నీట్-పీజీ కొత్త షెడ్యూల్పై హర్యానాలోని పంచకులలో మాట్లాడారు. నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షల వివాదం నేపథ్యంలో ఈ నెల 23న జరగాల్సిన నీట్-పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే.