Nita Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani ) ఉత్తరప్రదేశ్లోని వారణాసి వెళ్లారు.
అక్కడ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని ( Kashi Vishwanath Temple) సందర్శించి విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తన కుమారుడి ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథుడి పాదాల చెంత ఉంచారు. తన కుమారుడి వివాహానికి ఆదిదంపతుల కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించారు. పూజల అనంతరం నీతా అంబానీ మాట్లాడారు. అనంత్, రాధికల వివాహ ఆహ్వాన పత్రికను శివయ్యకు అందించడానికి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. దాదాపు పదేళ్ల తర్వాత కాశీకి వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎంతో సంతోషం కలిగినట్లు చెప్పారు. కాగా, వారణాసి పర్యటన సందర్భంగా నీతా అంబానీ ఓ సాధారణ దుకాణంలో చాట్ (chaat)ను ఆశ్వాదించారు. స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నీతా అంబానీకి కాశీ విశ్వనాథ ఆలయ నమూనాను బహుమతిగా అందజేశారు.
#WATCH | Varanasi, Uttar Pradesh: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani visits a chaat shop and interacts with locals pic.twitter.com/1QIY4Ha0xs
— ANI (@ANI) June 24, 2024
కాగా, అనంత్ – రాధికల వివాహం ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ‘జియో వరల్డ్ ప్లాజా’ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహ తంతు జులై 12న (శుక్రవారం) మొదలై.. జులై 14న (ఆదివారం) మంగళ ఉత్సవ్ (రిసెప్షన్)తో ముగియనుంది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ తారలు సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో ఇప్పటికే ఆ ఇంట వేడుకలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్ జామ్ నగర్లో జరిగిన ఈ వేడుకలకు దేశ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఆ తర్వాత రెండోసారి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా నిర్వహించారు. మే 29వ తేదీన ఇటలీ (Italy)లో మొదలైన వేడుకలు జూన్ 1న స్విట్జర్లాండ్ (Switzerland)లో ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్ షిప్లోనే కొనసాగాయి. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్లోని పెద్ద స్టార్స్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Uttar Pradesh: Reliance Foundation Founder and Chairperson, Nita Ambani says, “I offered prayers to lord Shiva. I am feeling very blessed. Today I came here with the invitation for the wedding of Anant and Radhika to offer it to the almighty. I came here after 10 years.… https://t.co/KpZGiAWzvq pic.twitter.com/JY6aqFi7bn
— ANI (@ANI) June 24, 2024
रिलायंस फाउंडेशन की अध्यक्ष श्रीमती नीता अंबानी ने काशी विश्वनाथ मंदिर के दर्शन किए और गंगा आरती के बाद वाराणसी के प्रसिद्ध काशी चाट भंडार में अलग अलग तरह के चाट का जायका लिया#RelianceFoundation #NitaAmbani #AnantAmbani #RadhikaAmbani #kashivishwanathtemple #MoneycontrolHindi pic.twitter.com/yQWDcYWXHG
— Moneycontrol Hindi (@MoneycontrolH) June 24, 2024
Nita Ambani Offered the First invitation of her Son’s wedding to काशीपुराधीश्वरी मां विशालाक्षी एवं काशीपुराधिपति बाबा विश्वनाथ ❤️🌸 pic.twitter.com/y3YJRKQjn8
— Akanksha Ojha (@obsolete_utopia) June 24, 2024
Also Read..
Minister Atishi | క్షీణించిన ఆతిషి ఆరోగ్యం.. ఢిల్లీ మంత్రికి ఐసీయూలో చికిత్స
Axar Patel: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అక్షర్ పటేల్.. వీడియో