Assam Floods | అస్సాంలో వరద బీభత్సం (Assam Floods) కొనసాగుతోంది. 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల కారణంగా 23 జిల్లాల్లో 11.3 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇక ఈ ఏడాది వరదలు, కొండ చరియలు విరిగిపడటం, తుపానుల కారణంగా రాష్ట్రంలో మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2 లక్షల మంది ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 72 పునరావాస శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందులో 8 వేల మందికిపైగా తలదాచుకుంటున్నారు.
బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో దిబ్రూగఢ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. గువహటిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవతా విగ్రహాలు నీట మునిగాయి. ఇక ఈ వరదల కారణంగా కజిరంగ జాతీయ పార్కు (Kaziranga National Park) తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో నాలుగు జింకలు నీటమునిగి మృతి చెందాయి. సుమారు 24 ఇతర జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అస్సాం ప్రజలను తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఎండీ హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
#WATCH | Golaghat: Flood situation persists in Kaziranga National Park, in Assam (02.07) pic.twitter.com/2HeA0YA4NX
— ANI (@ANI) July 2, 2024
Also Read..
Women Missing | మధ్యప్రదేశ్లో మూడేళ్లలో 31 వేల మంది మహిళలు మిస్సింగ్
Hathras | హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Vijay Thalapathy | నీట్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం : హీరో విజయ్