Assam Floods : అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో పలు గ్రామాలు నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. ఇక మరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి.
వర్షాల కారణంగా అసోంలోని బ్రహ్మపుత్ర నది నీటిమట్టం పెరగడంతో నగాంవ్, డిబ్రుగఢ్ జిల్లాలు నీట మునిగాయి. రహదారులు, ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇక గాలుల ఉధృతికి భారీ వృక్షాలు సైతం నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
#WATCH | Flood situation in Assam’s Morigaon district worsens as water from the overflowing Brahmaputra submerges more and more villages. pic.twitter.com/9hp0uh3zOo
— ANI (@ANI) July 2, 2024
ఇక ఉత్తరాఖండ్లోని అలకనందా నది పొంగిపొర్లుతుండటంతో సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు జులైలో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం కురిసిందని ఐఎండీ తెలిపింది.
Read More :
Rahul Dravid: రోహిత్ శర్మ ఫోన్ కాల్ను గుర్తు చేసుకున్న రాహుల్ ద్రావిడ్.. వీడియో