Bhushi Dam | ముంబై (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలోని భూషి డ్యామ్ వెనుక భాగంలో ఉన్న జలపాతం ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా, మిగతా ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతున్నది.
ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. లోనావాలాలో రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా..ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో ఐదుగురు పర్యాటకులు డ్యామ్లోకి కొట్టుకుపోయారు.