Lok Sabha | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేస్తున్నారు. మొత్తం తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది.
#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0
— ANI (@ANI) June 24, 2024
async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″>
అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జూన్ 28న ప్రారంభం అవుతుందని, ప్రధాని మోదీ జూలై 2 లేదా 3న చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
Delhi: First session of the 18th Lok Sabha commences at the new Parliament building. Swearing-in ceremony of the newly-elected MPs to take place shortly. pic.twitter.com/lFVl7aKDPq
— ANI (@ANI) June 24, 2024
Also Read..
PM Modi | మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తాం : ప్రధాని మోదీ
Bhartruhari Mahtab | ప్రొటెం స్పీకర్గా భర్తృహరి ప్రమాణం.. మరికాసేపట్లో లోక్సభ సమావేశాలు ప్రారంభం
Nagarjuna | అభిమానికి హీరో నాగార్జున క్షమాపణ.. ఎందుకంటే?