న్యూఢిల్లీ, జూన్ 7: 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 15న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించునున్నారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. అనంతరం లోక్సభకు కొత్త స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. సమావేశాల తేదీలపై కొత్త క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. జూన్ 22తో సమావేశాలు ముగుస్తాయి. ఆదివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రివర్గం సమావేశం కానున్నది.