New Criminal Laws | దేశంలో కొత్త సోమవారం నుంచి మూడు క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. రెండురాష్ట్రాలకు చెందిన పోలీసులు కొత్త చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఇదే చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మహారాష్ట్ర అసెంబ్లీ వేదిక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన చేశారు. సింధుదుర్గ్ జిల్లాలోని సావంత్వాడి పోలీసులు కొత్త చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న ఆయన.. కేసు వివరాలను మాత్రం ప్రస్తావించలేదు. తెల్లవారుజామున 2.19 గంటలకు సావంత్వాడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఇక ఒడిశాలో బెదిరింపుల కేసులో ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒడిశా పోలీసులు పేర్కొన్నారు.
బాధితుడి కొడుకు రుద్ర కొడుకు ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని 126(2), 115(2), 109, 118(1), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రుద్ర తండ్రి గౌరంగ్ చరణ్ దాస్పై ముగ్గురు వ్యక్తులు బ్లేడుతో దాడి చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జూన్ 29న ఈ ఘటన జరగ్గా.. లక్ష్మీసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ పీ శ్యామ్ సుందర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతలను ఎస్ఐ జీ సాహాకు అప్పగించారు. ఒడిశా డీజీపీ అరుణ్ కుమార్ సారంగి మాట్లాడుతూ.. మూడు క్రిమినల్ చట్టాలను అమలు చేయడానికి ఒడిశా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దర్యాప్తు అధికారులందరూ చట్టాలపై శిక్షణ పొందారు. రాబోయే రోజుల్లో సీనియర్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ లా యూనివర్సిటీతో కలిసి పనిచేశాము. శిక్షణా సామగ్రి పోలీస్ స్టేషన్లలో సిద్ధం చేసి పంపిణీ చేస్తారు.