రాంచీ: ల్యాండ్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై ఆయనను విడుదల చేయాలని న్యాయమూర్తి రొంగన్ గంగోపాధ్యాయ తీర్పు చెప్పారు. ఈడీ ఆరోపిస్తున్నట్టుగా ఆయన మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31న హేమంత్ సొరేన్ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన బిర్సా ముండా జైలులో ఉన్నారు. దాదాపు 5 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో జేఎంఎం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
బయటకు వచ్చిన అనంతరం సొరేన్ మాట్లాడుతూ.. ‘నాపై తప్పుడు కేసు బనాయించారు. కుట్ర చేసి ఐదు నెలలు జైలులో పెట్టారు. నేను మొదలెట్టిన పనిని పూర్తిచేస్తా. యుద్ధాన్ని కొనసాగిస్తా’ అని పేర్కొన్నారు.