న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు (Delhi Rains) పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కూడళ్లలో ఉన్న అండర్పాస్లు నీటితో నిండాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓఖ్లాలోని అండర్పాస్లో నిలిచిన నీటిలో మునిగి వృద్ధుడు మరణించాడు. మృతుడ్ని 60 ఏళ్ల దిగ్విజయ్ కుమార్ చౌదరిగా గుర్తించారు. స్కూటీ నడిపిన ఆయన అక్కడి నీటిలో పడి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఔటర్ నార్త్ ఢిల్లీలోని సమయ్పూర్ బద్లీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం అండర్పాస్లో నీటిలో మునిగి ఇద్దరు బాలురు, మరోచోట ఇద్దరు పిల్లలు చనిపోయారు.
Aims Floods
కాగా, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బేస్మెంట్ ప్రాంతం శనివారం కూడా వరద నీటితో నిండింది. ఆపరేషన్ థియేటర్, ట్రామా సెంటర్ కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వైద్య సేవలు నిలిపివేసినట్లు ఎయిమ్స్ అధికారి తెలిపారు. అయితే విద్యుత్ పునరుద్ధరణ తర్వాత పరిస్థితి సీరియస్గా ఉన్న నలుగురికి శస్త్రచికిత్సలు జరిగాయని చెప్పారు. నిలిచి ఉన్న నీటిని మోటార్ పంపుల ద్వారా తోడినట్లు వెల్లడించారు.