Earthquake : లడఖ్లోని లేహ్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.
బుధవారం ఉదయం 8.12 గంటలకు లేహ్లో భూకంపం సంభవించిందని ఎన్సీఎస్ తెలిపింది. సముద్ర మట్టానికి 150 కిలోమీటర్ల లోతులో 36.10 వెడల్పు, 74.81 పొడవుతో భూకంపం నమోదైందని ఎన్సీఎస్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఈ భూకంపంవల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.