చెన్నై: తమిళనాడులోని అన్ని వర్గాల ప్రజలకు విద్య చేరువకావడానికి ద్రవిడ ఉద్యమమే ప్రధాన కారణమని డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్ఎస్ భారతి అన్నారు. కుక్క కూడా బీఏ పట్టా పొందే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందన్నారు. (even dog can get BA degree) అయితే ఈ వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. డీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి, కాంచీపురం ఎమ్మెల్యే ఎజిలరాసన్ ఆధ్వర్యంలో ‘నో మోర్ నీట్’ పేరుతో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మాట్లాడారు. తాను న్యాయవాదినని, బీఎల్ చదివానని తెలిపారు. ఎజిలరాసన్ కూడా బీఈ, బీఎల్ చదివారని చెప్పారు. ఈ డిగ్రీలు వంశం లేదా గోత్రం వల్ల వచ్చినవి కావని అన్నారు. ‘నేను బీఏ చదివినప్పుడు ఊర్లో ఒక్కడే బీఏ చదివాడు. అప్పుడు ఇంటి బయట నేమ్ ప్లేట్పై డిగ్రీ రాసుకునేవారు. ఇప్పుడు ఊర్లో అందరూ డిగ్రీ చదువుతున్నారు. కుక్క కూడా బీఏ డిగ్రీ పొందుతుంది. ఈ అభివృద్ధికి ద్రవిడ ఉద్యమమే కారణం’ అని అన్నారు.
కాగా, డీఎంకే నేత భారతి వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమిళనాడులోని మొత్తం విద్యార్థి సమాజాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఎక్స్లో విమర్శించారు. సీఎం స్టాలిన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించిన డీఎంకే, తమ చర్య వల్ల డాక్టర్ల సంఖ్య పెరిగిందని గొప్పలు పోతోందని ఆరోపించారు.
எப்போதெல்லாம், திமுக ஆட்சிக்கு, பொதுமக்களிடையே பலத்த எதிர்ப்பு வருகிறதோ, அப்போதெல்லாம், அறிவாலய வாசலிலேயே இருக்கும் திரு. ஆர்.எஸ்.பாரதியை ஏவி விடுவார்கள் போல. கள்ளக்குறிச்சியில், திமுக ஆதரவோடு நடந்த கள்ளச்சாராய விற்பனையில் 65 உயிர்கள் பலியானதை மடைமாற்ற, திரு. ஆர்.எஸ்.பாரதியைக்… pic.twitter.com/yLjpcK9Lkh
— K.Annamalai (@annamalai_k) July 3, 2024