న్యూఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు చేస్తున్న ఆప్ మంత్రి ఆతిషి (Minister Atishi) ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడంతో ఆమెను లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్కు (LNJP) తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. నాలుగు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.
ఆతిషి రక్తనమూనాలకు ఆస్పత్రికి పంపింమని, రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధరించారని చెప్పారు. శరీరంలో కీటోన్ స్థాయి పెరిగిందనీ, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. వెంటనే దవాఖానలో చేర్చించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అందుకే దవాఖానకు తరలించామని తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం ఆతిషి పోరాడుతున్నారని చెప్పారు.
ఢిల్లీకి చెందిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుంచి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. హర్యానా నీటిని విడుదల చేసే వరకు ఆమరణ నిరవధిక దీక్షను విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ 36కు పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. కాగా, దిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 ఎమ్జీడీ (రోజుకు మిలియన్ గ్యాలన్లు) తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోందని ఆతిశీ తెలిపారు. దీంతో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆతిశీ అన్నారు.
🚨 Water Minister Atishi’s health deteriorates 🚨
Her blood sugar level dropped to 43 at midnight and to 36 at 3 AM, after which LNJP Hospital doctors advised immediate hospitalization. She has not eaten anything for the last five days and is on an indefinite hunger strike… pic.twitter.com/nl5iTfnwnT
— AAP (@AamAadmiParty) June 24, 2024