న్యూఢిల్లీ, జూలై 2: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం సీబీఐకి నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లో స్పందన తెలియజేయాలని సీబీఐని ఆదేశించింది.
వారు సమాధానం ఇచ్చిన తర్వాత దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే కేజ్రీవాల్ కౌన్సిల్ రెండు రోజుల తర్వాత రిజాయిండర్ దాఖలు చేయవచ్చునని పేర్కొంటూ కేసును జూలై 17కి వాయిదా వేసింది. కాగా, తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.