Modi 3.0 : నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆరోపించారు. సీడీఎస్, త్రివిధ దళాధిపతులను వెనుక వరుసలో కూర్చోబెట్టారని, వారి ముందు పారిశ్రామికవేత్తలు, నటులు ఆసీనులయ్యారని అన్నారు.
ఇది దురదృష్టకరమని, దీన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. దేశ సాయుధ దళాలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.
ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జై జవాన్, జై కిసాన్ అని నినదించే దేశం మనదని, సంపన్నులకు జై కొట్టే దేశంగా మారేలా వ్యవహరించరాదని ఆయన పేర్కొన్నారు.
Read More :
Akshay Kumar | ఆగస్టు 15పైనే అక్షయ్ కుమార్ ఫోకస్.. పుష్ప ది రూల్ రిలీజ్ డైలమా..?