NEET Scam : దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణలో అత్యధికంగా పేపర్ లీకేజ్ కేసులు వెలుగుచూశాయని చెప్పారు.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తాము ఈ అంశాన్ని ఇవాళ పార్లమెంట్లో చర్చకు లేవనెత్తితే మైక్ను స్విచాఫ్ చేశారని మండిపడ్డారు.
విపక్ష నేత మైక్ను నిలిపివేయడంతో విపక్ష ఎంపీలు అసంతృప్తికి లోనై ప్రభుత్వ తీరును తప్పుపట్టారని చెప్పారు. కీలకమైన నీట్ అంశంపై సభలో చర్చ జరగాలని తాము పట్టుబట్టామని ఆయన పేర్కొన్నారు.
Read More :
Swatch Hyderabad | గాడి తప్పిన పారిశుధ్యం.. ప్రశ్నార్థకంగా మారుతున్న స్వచ్ఛ హైదరాబాద్