పదేండ్ల బీజేపీ హయాంలో హరియాణ అన్ని రంగాల్లో వెనకబడిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా ఆరోపించారు. హరియాణ భ్రష్టుపట్టడానికి బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ వైఫల్యాలను ఎండగడతూ తాను పాదయాత్ర చేపట్టానని దీపీందర్ హుడా వెల్లడించారు.
హరియాణలోని రెవారిలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత పదేండ్లుగా హరియాణ ఎందుకు ఇంత వెనుకబాటుకు గురైందనే ప్రశ్నలకు కాషాయ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హరియాణ మాంగే హిసాబ్ క్యాంపెయిన్లో భాగంగా దీపీందర్ హుడా రెవారిలో భారీ రోడ్షో నిర్వహించారు. కాషాయ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కాషాయ పార్టీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన మండిపడ్డారు.
Read More :
Dinesh Saraogi | విమానంలో మహిళకు లైంగిక వేధింపులు.. జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ సరోగీపై కేసు