Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 61కి పెరిగింది. సుమారు 118 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, కల్తీ మద్యం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission) సుమోటోగా స్పందించింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక కోరింది. మరోవైపు ఈ కల్తీ సారా ఘటనలో ఆరుగురు మహిళలు కూడా మరణించడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యురాలైన ఖుష్బు సుందర్ ఇవాళ బాధిత కుటుంబాలతోపాటు చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించనున్నారు.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సీబీఐ.. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
Om Birla | లోక్సభ స్పీకర్గా మరోసారి ఓంబిర్లా.. మూజువాణీ ఓటుతో ఇండియా కూటమి అభ్యర్థిపై గెలుపు
Lok Sabha Speaker | ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన తృణమూల్