Toxic Alcohol | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi)లో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరుణాపురంలో కల్తీసారా ఘటనలో శుక్రవారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య 47కు చేరినట్లు తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మందికిపైగా బాధితులు జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో నిపుణులైన వైద్యులను అధికారులు రంగంలోకి దింపారు.
Also Read..
Bus Accident | లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి