Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఉదయం వరకూ అందిన సమాచారం ప్రకారం.. కల్తీసారా ఘటనలో మరణించిన వారి సంఖ్య 53కు పెరిగినట్లు కళ్లకురిచి జిల్లా కలెక్టర్ ఎమ్ఎస్ ప్రశాంత్ (Collector MS Prashanth) తెలిపారు.
కాగా, ఈ ఘటనలో సుమారు 120 మంది బాధితులు జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో నిపుణులైన వైద్యులను అధికారులు రంగంలోకి దింపి చికిత్స అందిస్తున్నారు.
Death toll in Kallakurichi hooch tragedy rises to 53, confirms Kallkurichi District Collector MS Prashanth.#TamilNadu
— ANI (@ANI) June 22, 2024
Also Read..
YSRCP Office : తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆఫీసు కూల్చివేత.. వీడియో
Minister Jupally Krishna Rao | ఈశ్వరమ్మను పరామర్శించిన మంత్రి జూపల్లి.. తక్షణ సాయంగా రూ.2 లక్షలు
T20 Worldcup: దంచికొట్టిన షాయ్ హోప్.. 9 వికెట్ల తేడాతో విండీస్ విజయం