Toxic Alcohol | తమిళనాడు (Tamil Nadu)లోని కళ్లకురిచి (Kallakurichi)లో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. అస్వస్థతకు గురైన మరో 60 మందికిపైగా కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్ దవాఖానకు తరలించారు.
ఈ ఘటనపై సీఎం స్టాలిన్ (MK Stalin) సీరియస్ అయ్యారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, అదేవిధంగా చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్ దాస్ నేతృత్వంలో కమిటీని వేశారు. నాటు సారా అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కళ్లకురిచి కలెక్టర్పై సీఎం బదిలీ వేటు వేశారు. జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాను సస్పెండ్ చేశారు. వీరితోపాటు మరో 9 మందిని కూడా సస్పెండ్ చేశారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు.
Death toll due to Kallakurichi hooch tragedy rises to 34.
Tamil Nadu CM MK Stalin announces Rs 10 lakhs each for the family of deceased and Rs 50,000 each for the people under treatment. A one-man commission, comprising former judge Justice B Gokuldas, announced for probing the…
— ANI (@ANI) June 20, 2024
Also Read..
Droupadi Murmu | పుట్టినరోజు సందర్భంగా.. జగన్నాథ్ మందిర్లో రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు
Delhi Heatwave | అగ్నిగుండంలా ఢిల్లీ.. వడగాడ్పులకు తొమ్మిది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు మృత్యువాత
Hajj pilgrims | మక్కాలో తీవ్రమైన వేడి.. మృతిచెందిన హజ్ యాత్రికుల్లో 90 మంది భారతీయులే..?