NEET Issue : దేశంలో అనేక అంశాలపై మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నీట్ అంశంపై నోరు మెదపడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విస్మయం వ్యక్తం చేశారు.
నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజ్ వెలుగుచూడటంతో ఇది జాతీయ అంశంగా మారిందని, ఇంత రగడ జరిగినా ప్రధాని మోదీ మౌనం దాల్చారని మండిపడ్డారు.లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తో ముడిపడిన ఈ వ్యవహారంపై ప్రధాని పెదవివిప్పాలని డిమాండ్ చేశారు.
నీట్ను రద్దు చేసి, ప్రవేశ పరీక్షల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాలను రాష్ట్రాలకు కట్టబెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని చెప్పారు. ఇక నీట్ వ్యవహారంపై కాంగ్రెస్తో పాటు పలు పార్టీలు, విద్యార్ధి, యువజన సంఘాలు ఆందోళన చేపడుతున్నాయని తెలిపారు.
Read More :
Assam Flood | అస్సాంని ముంచెత్తిన వరదలు.. 30 మంది మృతి