కోజికోడ్: సున్నీ యువజన సంఘం నేత ముస్తఫా ముందుపర చేసిన ప్రత్యేక ‘మలబారు రాష్ట్రం’ వ్యాఖ్య లు కేరళను కుదిపేస్తున్నాయి. మలప్పురంలోని స్కూళ్లలో 11వ తరగతిలో సీట్లు లేకపోవడాన్ని నిరసిస్తూ నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ ఇది ఇలాగే కొనసాగితే ప్రత్యేక ‘మలబారు రాష్ట్రం’ డిమాండ్ తెరపైకి వస్తుందని, అప్పుడు తమనెవరూ నిందించవద్దని హెచ్చరించారు. మలబారు రాష్ట్రం ఉంటే ఏమవుతుందని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ తీవ్రంగా స్పందించారు. కేరళను విభజించాలని ముస్తఫా డిమాండ్ చేస్తుంటే సీఎం విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కిక్కురుమనకుండా కూర్చున్నారని దుయ్యబట్టారు.