Lok Sabha | కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మోదీ 3.0 కేబినెట్ కూర్పు కూడా పూర్తైంది. ఇక ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఆసక్తి నెలకొంది. 18వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అదే సమయంలో స్పీకర్ ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రయత్నించింది.
అయితే ఈ ఎన్నికలో అనూహ్యంగా ట్విస్ట్ చోటు చేసుకుంది. విపక్ష ఇండియా కూటమి కూడా పోటీకి సిద్ధమైంది. ఇండియా కూటమి సభ్యులతో రాజ్నాథ్ సింగ్ జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీయే తరఫున లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా (Om Birla) , విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ (MP Suresh) నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, మంగళవారం ఉదయం స్పీకర్ ఎన్నికకు సహరించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియా కూటమి నేతలను కోరారు. అయితే, స్పీకర్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఓ మెలిక పెట్టింది. డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి దాదాపు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీకి దిగింది. కాంగ్రెస్ ఎంపీ సురేశ్ను బరిలోకి దింపింది. దీంతో ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్పీకర్ పదవి.. ఇప్పుడు తొలిసారి ఆ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
Congress MP K Suresh filed his nomination for the post of Speaker of the 18th Lok Sabha
NDA has fielded BJP MP Om Birla for the post of Speaker
(Picture shared by a Congress MP) pic.twitter.com/q5ZbvRVrgR
— ANI (@ANI) June 25, 2024
Also Read..
Lok Sabha Speaker | స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్.. పోటీలో విపక్ష కూటమి.. తొలిసారి ఎన్నికలు
Om Birla | లోక్సభ స్పీకర్గా మరోసారి ఓంబిర్లాకే ఛాన్స్.. మరికాసేపట్లో నామినేషన్