Criminal Laws | బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు (New Criminal Code) దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్) చట్టాలను తీసుకువచ్చారు. అయితే, ఈ కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా అమల్లోకి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పార్లమెంట్ ఉభయ సభల్లో 146 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటకు పంపించి (Mass MP Suspension), బలవంతంగా కొత్త నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను పాస్ చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఎన్నికల్లో నైతికంగా ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాజ్యాంగానికి విలువ ఇస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ, నిజం ఏంటంటే.. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను 146 మంది ఎంపీలను బలవంతంగా సస్సెండ్ చేసి ఆమోదించారు. భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్ న్యాయం’ ఆధిపత్యాన్ని ఇండియా కూటమి ఇకపై అనుమతించబోదు’ అని ఖర్గే పేర్కొన్నారు.
కాగా, భారతదేశ నేర న్యాయ వ్యవస్థ, నేరాల దర్యాప్తు, విచారణ ప్రక్రియలో ఈ కొత్త చట్టాలు వేగం తీసుకురానున్నాయని, ఒక ఆధునిక న్యాయ వ్యవస్థను అందించనున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త చట్టాల్లో జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, ఎంఎస్ఎం వంటి ఎలక్ట్రానిక్ మోడ్ విధానంలో సమన్లు జారీ, అతి క్రూరమైన నేరాల క్రైమ్ సీన్లను వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా కాకుండా కొత్త చట్టాలు ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా గతంలో చెప్పారు.
కొత్త చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..
Also Read..
Lok Sabha | నీట్ అంశంపై చర్చకు స్పీకర్ నిరాకరణ.. లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్
Bengaluru Firm | టీమ్ఇండియా విక్టరీ.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన బెంగళూరు సంస్థ
JP Nadda | మహిళలకు పశ్చిమ బెంగాల్ సురక్షితం కాదు : జేపీ నడ్డా