న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ నిందలు వేసింది. (Congress blames AAP) లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూటమి ఓటమికి ఆప్ కారణమని ఆరోపించింది. ఆప్ మద్యం పాలసీ స్కామ్ వల్లనే ఢిల్లీలో ఓడామని కాంగ్రెస్ నేత అభిషేక్ దత్ అన్నారు. ఎక్సైజ్ కుంభకోణాన్ని కాంగ్రెస్ బహిర్గతం చేసినప్పుడు సరైన దర్యాప్తు జరుపాలని ఆప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి 18 నెలలు గడిచినా ఈడీ, సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అయితే లోక్సభ ఎన్నికలకు నెల ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆయన అన్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేయకపోతే కాంగ్రెస్ సీట్లు పెరిగేవని అభిషేక్ దత్ అభిప్రాయపడ్డారు. ఆప్ ఎక్సైజ్ స్కాం కారణంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నష్టపోయిందని ఆరోపించారు. ‘కుంభకోణంలో ప్రమేయం ఉన్నందున సత్యేందర్ కుమార్ జైన్ జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా జైలులో ఉన్నారు. వారందరి వల్ల కాంగ్రెస్ నష్టపోయింది’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఢిల్లీలో తాగు నీటి ఎద్దడిపై నిరసన చేసిన ఆప్ మంత్రి అతిషి పైనా అభిషేక్ దత్ మండిపడ్డారు. ధర్నా పేరుతో ఆమె డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల ఆప్ నష్టపోతుందని అన్నారు. ‘ప్రజలకు పూర్తి సౌకర్యాలు కల్పించడమే మంత్రి పని. ఢిల్లీలో నీళ్లు లేవు. వారు ధర్నా చేస్తున్నారు’ అని విమర్శించారు.
#WATCH | Delhi: Congress leader Abhishek Dutt says, "When we exposed excise scam, we demanded the then government to conduct a proper investigation. ED and CBI didn't take any action, even after 18 months of filing the case. But, just 1 month before the Lok Sabha polls, they… pic.twitter.com/9TYjbifIce
— ANI (@ANI) June 29, 2024