CLAT | న్యూఢిల్లీ, జూన్ 30: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం(ఎన్ఎల్యూ) 2025 సంవత్సరానికి గాను కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేయనుంది. ఈ ఏడాది డిసెంబర్ 1న అడ్మిషన్ టెస్ట్ నిర్వహించనుంది.
22 జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలు, ఇతర సంబంధిత న్యాయ విద్యా సంస్థలు అందిస్తున్న యూజీ, పీజీ కోర్సుల్లో సీట్లు పొందాలనుకొనే విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో క్లాట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్ఎల్యూ వెబ్సైట్ పేర్కొంది.
వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ మాధ్యమంలో నీట్ యూజీ!
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్షను పెన్ అండ్ పేపర్ పద్ధతిలో కాకుండా, ఆన్లైన్ మోడ్లో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నదని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. కాగా, నీట్-పీజీ పరీక్ష తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రీషెడ్యూల్ చేయనున్నది. ఒకటిరెండు రోజుల్లో పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను ప్రకటించనున్నది.