Chirag Paswan : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. పట్నాలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో విపక్షం ఎన్నో అంశాలు చెబుతూ హామీల వర్షం కురిపించిన వాస్తవంగా ఫలితాలు ఎలా ఉన్నాయో చూశామని చెప్పారు.
బిహార్లో తాము అత్యధిక స్ధానాలు గెలుచుకున్నామని, తమ పార్టీ పోటీ చేసిన 5 స్ధానాల్లోనూ విజయం సాధించిందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే బిహార్ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రజలు గుర్తెరిగారని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు బిహార్కు ప్రత్యేక హోదా ప్రకంటించాలని లేనిపక్షంలో ప్రత్యేక ప్యాకేజ్ను కేటాయించాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీ(యూ) ఓ తీర్మానం ఆమోదించింది.
ఎన్డీయే సర్కార్లో జేడీ(యూ) కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీ బిహార్కు ప్రత్యేక హోదాపై బలంగా గళం వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు రాష్ట్రాలు హోదా కోసం గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న క్రమంలో బిహార్కు ప్రత్యేక హోదాపై ఎన్డీయే కీలక భాగస్వామి జేడీయూ పట్టుబడుతుండటంతో కాషాయ పాలకుల తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.
Read More :
Samantha | అవి తెలియక చేసిన తప్పులు.. తెలుసుకున్న తర్వాత.. : సమంత