NEET Paper Leak | గోద్రా: నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన కేసులో గుజరాత్లోని గోద్రాలో ఓ ప్రైవేట్ స్కూల్ యజమానిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు.
మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్ష నిర్వహణకు ఎంపిక చేసిన కేంద్రాల్లో జై జలరామ్ స్కూల్ ఒకటి. ఇది పంచమహల్ జిల్లాలోని గోద్రా సమీపంలో ఉంది. దీని యజమాని దీక్షిత్ పటేల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన ఈ పరీక్షలో పాస్ చేయించడానికి సుమారు 27 మంది అభ్యర్థుల నుంచి రూ.10 లక్షలు చొప్పున డిమాండ్ చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నిందితులకు లంచాలు ఇచ్చిన అభ్యర్థుల స్టేట్మెంట్లను గత వారం రికార్డు చేశారు.