న్యూఢిల్లీ, జూన్ 29: గుజరాత్లోని రాజ్కోట్ ఎయిర్పోర్టు టెర్మినల్ బయట వాహనాలు ఆగే చోట నీడ కోసం ఏర్పాటు చేసిన పందిరి పైకప్పు భారీ వర్షానికి కూలిపోయింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 కూలిపోయిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది.
అయితే నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు మరమ్మతులు జరుగుతుండగా పందిరి విరిగిపోయినట్టు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, దీనిపై నివేదిక కోరినట్టు వారు చెప్పారు.